Nov 06,2023 14:30

అమరావతి: కోడికత్తి కేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు శ్రీనివాసరావు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఎన్‌ఐఏ తరఫు న్యాయవాది కౌంటర్‌ దాఖలు చేశారు. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 15కి వాయిదా వేసింది. విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌పై దాడి చేసిన కేసులో పిటిషనర్‌ శ్రీనివాసరావు నాలుగేళ్లకు పైగా జైల్లోనే మగ్గుతున్నాడని అతడి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.