
చండీగఢ్ / జైపూర్ : రాజస్థాన్లో బజరంగ్దళ్ నేతృత్వంలోని గోగూండాలు రెచ్చిపోయారు. గోవులను అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆరోపిస్తూ రాజస్థాన్కు చెందిన ఇద్దరు ముస్లిం యువకులను కారులో కిడ్నాప్ చేసి, హర్యానాలోని భైవానీ జిల్లా లోహారు వద్ద సజీవం దహనం చేశారు. మృతుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లా పహరి తాలుకా ఘాట్మీక గ్రామానికి చెందిన నసీర్ (25), జునైద్ అలియాస్ జునా (35)లను బుధవారం గోగూండాలు కిడాుప్ చేశారు. లోహారు వద్ద కాలిపోయిన బలేరో వాహనంలో వీరి మృతదేహలను గురువారం గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ (ఎఫ్ఎస్ఎల్), ఇతర బృందాలు వాహనాన్ని, మృతదేహాలను తనిఖీ చేశాయి. కిడ్నాప్ చేసిన ఇద్దరు యువకుల్ని భరత్పూర్కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉను లోహారు కారులో తీసుకొచ్చి అక్కడ సజీవ దహనం చేసినట్లు అనుమానిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఐదుగురిపై గోపాల్గఢ్ పోలీస్ స్టేషన్ల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు భరత్పూర్ పోలీస్ సూపరింటెండెంట్ శ్యామ్ సింగ్ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని, మిగతా వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. రాజస్థాన్ గోపాల్గఢ్ పోలీసులు కిడాుప్ కేసు నమోదు చేశారని హర్యానా పోలీసులు పేర్కొన్నారు. వీరి హత్యలతో ఘటమీకలో ఉద్రిక్తత నెలకొంది. సుమారు రెండు వేల మంది సమావేశమవడానికి ప్రయతిుంచారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, సమావేశం కాకుండా చూశారు. ఈ ఘటనను సిపిఎం ఖండించింది. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.