Oct 06,2023 13:38

ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌ : భారతదేశంలోని ప్రముఖ ఆభరణాల బ్రాండ్‌లలో ఒకటైన కళ్యాణ్‌ జ్యువెలర్స్‌, చిత్తూరులోని ఎంఎస్‌ఆర్‌ సర్కిల్‌, పలమనేరు రోడ్‌ వద్ద తమ సరికొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. శుక్రవారం ఉదయం కళ్యాణ్‌ జువెల్లర్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ అక్కినేని నాగార్జున ఈ సరికొత్త షోరూమ్‌ను ప్రారంభించటానికి ప్రత్యేకంగా రావటంతో అభిమానులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కంపెనీ యొక్క 9వ షోరూమ్‌.

ఈ సందర్భంగా కళ్యాణ్‌ జ్యువెలర్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ... '' చిత్తూరులో జరుగుతున్న వేడుకల్లో భాగమైనందుకు ఆనందంగా ఉంది. కళ్యాణ్‌ జ్యువెలర్స్‌ నా హఅదయంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. భారతదేశ ఆభరణాల పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన బ్రాండ్‌తో సుదీర్ఘకాల అనుబంధాన్ని కలిగి ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. 'ట్రస్ట్‌ ఈజ్‌ ఎవ్రీథింగ్‌' అనే సూత్రం పట్ల వారు చూపుతున్న అచంచలమైన అంకితభావం నిజంగా పరిశ్రమలో వారిని విభిన్నంగా నిలుపుతుంది. నమ్మకం, పారదర్శకత, కస్టమర్‌ సంతఅప్తికి ప్రతీకగా ఈ బ్రాండ్‌ నిలుస్తుంది. దాని ప్రయాణంలో భాగం కావడం విశేషం. ఈ ప్రాంతంలోని అభిమానులు బ్రాండ్‌ కళ్యాణ్‌ జ్యువెలర్స్‌ పట్ల తమ ప్రేమను చూపుతారని, మద్దతును అందిస్తారని నేను విశ్వసిస్తున్నాను '' అని అన్నారు.

కొత్త షోరూమ్‌ ప్రారంభం గురించి కళ్యాణ్‌ జ్యువెలర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీ రమేష్‌ కళ్యాణరామన్‌ మాట్లాడుతూ ... ''ఒక కంపెనీగా, మేము భారీ మైలురాళ్లను సాధించాము. కస్టమర్‌ షాపింగ్‌ అనుభవాన్ని మెరుగుపరచడానికి సమగ్ర పర్యావరణ వ్యవస్థను రూపొందించే దిశగా పెద్ద పురోగతిని సాధించాము. మేము మా వఅద్ధి ప్రయాణం ఈ తదుపరి దశను ప్రారంభించినప్పుడు, మా కొత్త షోరూమ్‌ను చిత్తూరు లో ప్రారంభించడం పట్ల మేము సంతోషిస్తున్నాము. ఈ ప్రారంభంతో, మేము ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మా కార్యకలాపాలను నిలకడగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. కంపెనీ ప్రధాన విలువలైన నమ్మకం, పారదర్శకతకు కట్టుబడి ఉంటూనే మా కస్టమర్‌లకు అత్యుత్తమ-తరగతి షాపింగ్‌ అనుభవాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నాము '' అని అన్నారు

షోరూమ్‌ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని, కళ్యాణ్‌ జ్యువెలర్స్‌ ఒక ప్రత్యేకమైన ప్రమోషన్‌ను అందిస్తోంది : కనీసం రూ.1 లక్ష ఆభరణాలు షాపింగ్‌ చేసే కస్టమర్‌లకు సగం కొనుగోలు విలువపై 0 శాతం మేకింగ్‌ ఛార్జీలు అందిస్తారు. అదనంగా, కళ్యాణ్‌ స్పెషల్‌ గోల్డ్‌ బోర్డ్‌ రేట్‌ మార్కెట్‌లో అత్యల్పమైనది అన్ని కంపెనీ షోరూమ్‌లలో ప్రామాణికమైనది కూడా వర్తిస్తుంది. ఈ ఆఫర్‌లు పరిమిత కాలానికి మాత్రమే చెల్లుబాటు అవుతాయి.