ప్రజాశక్తి - చాపాడు (కడప) : అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాలలో చేపట్టిన అభివఅద్ధి, సంక్షేమ పథకాలను ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి వివరించగలుగుతున్నామని ఎమ్మెల్యే ఎస్ రఘురామి రెడ్డి సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని మెర్రాయపల్లె గ్రామ పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ... అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నామని, విద్య, వైద్యం, రైతులు, మహిళలకు అన్ని రకాల పథకాలను అందించగలుగుతున్నామన్నారు. సోమాపురం పంచాయతీ పరిధిలో రూ. 12 కోట్ల సంక్షేమం, అభివఅద్ధి పథకాలు ఈ నాలుగేళ్లలో చేపట్టామన్నారు. గత టిడిపి హయాంలో ఎలాంటి అభివఅద్ధి చేపట్టారో ప్రజలకు వివరించాలన్నారు. ఎన్నికలకు ముందు రైతురుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ వంటి పథకాలను ప్రవేశపెట్టి అందరినీ మభ్య పెట్టారన్నారు. ప్రస్తుతం టిడిపి నాయకులు గత రెండు దఫాలుగా ఎన్నికల్లో ఓడిపోయారని ప్రస్తుతం ఓట్లు వేయాలని అడగడం సిగ్గుచేటున్నారు. చేసిన అభివఅద్ధిని చూపి ఓట్లు అడిగితే బాగుంటుందన్నారు. వైసిపి 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటుందన్నారు. టిడిపి రాష్ట్రంలోని అన్ని పార్టీలతో పొత్తుల కోసం ఎదురుచూస్తుందన్నారు. యువగళంలో 4 వేలమంది పెయిడ్ వ్యక్తులు వెంట నడుస్తున్నారన్నారు. నియోజకవర్గ పరిధిలో గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు సాగునీటిని అందిస్తున్నామన్నారు. వేసవి సీజన్ లో 6వేల ఎకరాల్లో వరి, 4 వేల ఎకరాల్లో ఇతర పంటలను సాగు చేయడం ఇదే మొదటి సారి అన్నారు. రైతులకు దిగుబడి కూడా ఆశాజనకంగా ఉందని గిట్టుబాటు ధర కూడా ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. పంట పొలాలకు వెళ్లే రహదారులను అభివఅద్ధిపరిచేందుకు రూ.2312 లక్షలు మంజూరయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ టి లక్షుమయ్య , ఎంపీడీఓ శ్రీధర్ నాయుడు, తహశీల్దార్ సుభాని, ఐసిడిఎస్ సిడిపిఓ సావిత్రమ్మ, మండలస్థాయి అధికారులు, వైసీపీ నాయకులు రామ్మోహన్ రెడ్డి, లో నారాయణరెడ్డి, రామాంజనేయుల రెడ్డి, వినరు కుమార్ రెడ్డి, జయరామి రెడ్డి,పివి రమణారెడ్డి, జయ సుబ్బారెడ్డి ,సర్పంచ్ శ్రీనువాసుల రెడ్డి, హజరత్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి,వెంకట్రామిరెడ్డి, కొండారెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, ప్రసాద్, రమణయ్య పాల్గొన్నారు.










