Oct 04,2023 16:01

హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ అధికార బీఆర్‌ఎస్‌ స్పీడ్‌ పెంచింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగే అభ్యర్థి జాబితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టోపై తాజాగా బీఆర్‌ఎస్‌ కీలక ప్రకటన చేసింది.
అయితే, అక్టోబర్‌ 16వ తేదీన వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభను ప్లాన్‌ చేసింది. ఈ బహిరంగ సభలోనే సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను విడుదల ప్రకటించనున్నట్టు ఆర్థిక మంత్రి హరీష్‌ రావు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. వరంగల్‌ సభలో మేనిఫెస్టోను ప్రకటిస్తున్నాం. శుభవార్త వినడానికి ప్రజలంతా సిద్ధంగా ఉండండి. ఈసారి ప్రతిపక్షాలు మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా బీఆర్‌ఎస్‌ మేనిఫెస్ట్‌ ఉంటుంది అని తెలిపారు.మరోవైపు, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిపై మంత్రి హరీష్‌ రావు సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. హరీష్‌ రావు మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో రేవంత్‌ జైలు కెళ్లడం ఖాయం. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. డబ్బులు పంచి గెలవాలని రేవంత్‌ చూస్తున్నారు. ఓటుకు నోటు కేసులో విచారణ జరపాల్సిందేనని సుప్రీంకోర్టు కూడా తెలిపింది.