సింగరాయకొండ (ప్రకాశం) : సింగరాయకొండలో రాత్రి దొంగలు హల్ చల్ చేశారు. శుక్రవారం రాత్రి 7 ఇళ్లలో దొంగలు చొరబడి చోరీ చేశారు. ఎవరూ లేని ఇళ్లలో, తాళాలు వేసున్న ఇళ్లలో చొరబడి ఇంటి తాళాలను పగలగొట్టి బంగారాన్ని, డబ్బులను ఎత్తుకుపోయారు. సిఐ రంగనాథ్ రంగంలోకి దిగి పరిశీలించారు. దొంగలు వదిలిన మోటార్ బైక్ని స్వాధీనం చేసుకున్నారు.










