Jul 23,2021 18:15

అమరావతి : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం రాజీనామాలకు టిడిపి ప్రజాప్రతినిధులు సిద్ధమని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ పోరాట కమిటీ నాయకులకు చంద్రబాబు శుక్రవారం లేఖ రాశారు. 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' నినాదంతో.. ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి ప్లాంట్‌ను సాధించారని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చేపట్టే ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఎన్నో ఆటంకాలు దాటి 1992లో ప్లాంట్‌ను దేశానికి అంకితం చేశారని, 2000 సంవత్సరంలో రూ.4 వేల కోట్లకు ప్రైవేటీకరించేందుకు కేంద్రం సిద్ధపడిందని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు సిఎం జగన్‌ నేతృత్వం వహించాలని, ఉక్కు ఉద్యమాన్ని ముందుండి నడిపించాలి డిమాండ్‌ చేశారు.