Nov 20,2023 23:15

ప్రజాశక్తి - సీతానగరం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతుందని ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా అన్నారు. మండలంలోని ఇనగంటివారిపేట గ్రామంలో సోమవారం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన బ్రోచర్స్‌ను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు అభివృద్ధికి, సంక్షేమానికి ఆమడ దూరంలో ఉంటే వైసిపి పాలనలో ప్రతి గ్రామాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేసి చూపించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి జి.జ్యోస్నా, సర్పంచ్‌ ఎస్‌.రాంపండు పాల్గొన్నారు.