Nov 11,2023 22:28

సీటీ స్కాన్‌ ఏర్పాటు చేయండి

సీటీ స్కాన్‌ ఏర్పాటు చేయండి
ప్రజాశక్తి- శ్రీకాళహస్తి : స్థానిక ఏరియా ఆస్పత్రిలో సీటీ స్కాన్‌ ఏర్పాటు చేయాలని జాతీయ వినియోగదారుల హక్కుల కమిషను ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషను హెల్త్‌ అండ్‌ ఫుడ్‌ సేఫ్టీ ఏపీ కో- ఆర్డినేటరు హరీష్‌ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం వైసీపీ కార్యాలయంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డిని కలసి వినతిపత్రం సమర్పించారు. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శ్రీకాళహస్తి, వెంకటగిరి, సూళ్లూరుపేట, సత్యవేడు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సిటీ స్కాన్‌ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అన్నారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఏరియా ఆస్పత్రిలో సీటీ స్కాన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాతీయ వినియోదారుల హక్కుల కమిషన్‌ ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డిప్యూటీ చైర్మన్లు కోటేశ్వరబాబు, వినుకొండ మాధురి, స్టేట్‌ కో- ఆర్డినేటర్‌ వెంకట కిషోర్‌, ఆర్టీఐ ఇన్చార్జ్‌ భరత్‌ కుమార్‌ నాయుడు, స్టేట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ హరీష్‌ పాల్గొన్నారు.