ఛండీఘడ్ : కాంగ్రెస్ పార్టీ పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ ప్రమాణస్వీకారోత్స వేళ అపశ్రుతి చోటుచేసుకుంది. ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమానికి వెళ్తున్న కార్యకర్తలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. కార్యకర్తలు ప్రయాణిస్తున్న బస్సు, పంజాబ్ ఆర్టిసి బస్సు మోగా జిల్లాలో ఢకొీన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు కాంగ్రెస్ కార్యకర్తలు మృతిచెందారు. మరో 20 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు మోగా సీనియర్ ఎస్పి హర్మాన్వీర్ సింగ్ గిల్ తెలిపారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలచి వేసిందని పార్టీ అధ్యక్షుడు నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ తెలిపారు.