రికార్డులను పరిశీలిస్తున్న మేయర్
సచివాలయాన్ని సందర్శించిన మేయర్
నెల్లూరు:స్థానిక 12వ డివిజన్ 12/1 అల్లీపురం సచివాలయాన్ని నగరపాలక సంస్థ మేయర్ స్రవంతిజయవర్ధన్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పలు సమస్యలను మేయర్ దష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రూరల్ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనల మేరకు స్థానిక 12వ డివిజన్ 12/1 అల్లీపురం సచివాలయంను సందర్శించడం జరిగిందన్నారు. సచివాలయ పరిధిలోని ప్రజలకు పెన్షన్లు, అమ్మవడి, రేషన్ కార్డులు, టిడ్కో ఇళ్ళు తదితర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా, పథకాలు అందే క్రమంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. ప్రజలకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే వాటిని పరిష్కరించాలని సచివాలయ సిబ్బందికి మేయర్ ఆదేశాలు జారీ చేశారు. సమస్య ఏదైనా ఫోన్ ద్వారా కాని, నగరపాలక సంస్థ కార్యాలయంలో నేరుగా కాని తమను సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రమేష్, షఫీ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ప్రజలు పాల్గొన్నారు.










