ముంబయి : అశ్లీల చిత్రాలను నిర్మించి, యాప్ల ద్వారా విడుదల చేశారనే కేసులో నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్కుంద్రా అరెస్టయిన విషయం తెలిసిందే. శుక్రవారం రిమాండ్ ముగిసిన తరువాత అతన్ని పోలీసులు ముంబై మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఈ విషయంపై మరింత దర్యాప్తు చేయడానికి వీలుగా... అతని కస్టడీని పొడిగించాలని పోలీసులు కోర్టును కోరగా.. కోర్టు జూలై 27 వరకు రిమాండ్ను పొడిగించింది. పోలీసులు రాజ్కుంద్రా మొబైల్ఫోన్ను స్వాధీనం చేసుకొని.. వ్యాపార వ్యవహారాలు... లావాదేవీలను పరిశీలించనున్నారు. శుక్రవారం కుంద్రాతోపాటు, మరో నిందితుడు ర్యాన్ తోర్పేను కూడా పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు. గతంలో రాజ్కుంద్రా చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా ఆర్థికంగా లాభపడుతున్నారని పోలీసులు కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే.