Jul 23,2021 15:47

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత కేంద్రానిదేనని వైఎస్సార్‌ సీపీ ఎంపీలు పునరుద్ఘాటించారు. శుక్రవారం మధ్యాహ్నం ఉభయ సభలు వాయిదా పడిన తర్వాత వైఎస్సార్‌ సీపీ ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. దీనిలో భాగంగా వైఎస్సార్‌ సీపీ కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీతా విశ్వనాథ్‌, సహచర ఎంపీలు మాట్లాడుతూ.. పోలవరం సవరించిన అంచనాలను కేంద్రం ఆమోదించాలని వారు డిమాండ్‌ చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. కేంద్రప్రభుత్వం నుంచి ఇంకా 55 వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం రూ.2వేల కోట్లు ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిందని వారు పేర్కొన్నారు.