Nov 11,2023 22:26

'ప్రజా రక్షణభేరి' స్కూటర్‌ ర్యాలీ


'ప్రజా రక్షణభేరి' స్కూటర్‌ ర్యాలీ
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి : ఈ నెల 15వ తేదీన విజయవాడ వేదికగా జరిగే సీపీఎం ప్రజారక్షణ భేరి బహిరంగ సదస్సును జయప్రదం చేయాలంటూ శనివారం స్కూటర్‌ ర్యాలీ నిర్వహించారు. తొట్టంబేడు మండలం చిట్టత్తూరు నుంచి ర్యాలీ ప్రారంభమై కొత్తకండ్రిగ, శివనాథపాలెం మీదుగా పట్టణంలోని రాజీవ్‌ నగర్‌ కైలాసగిరి కాలనీకి చేరుకుంది. అంబేద్కర్‌ కూడలి నుంచి నాలుగు మాడవీధులులో ప్రజారక్షణ భేరి ఉద్దేశంను సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ప్రజలకు వివరించారు. ప్రజా ప్రణాళికకు వేదిక కానున్న ప్రజారక్షణ భేరిని జయప్రదం చేసేందుకు ప్రజలు విజయవాడకు తరలి రావాలని పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి మండలంలో కూడా ప్రజారక్షణ భేరి స్కూటర్‌ ర్యాలీ నిర్వహించారు. గంధం మణి, పెనగడం గురవయ్య, సంక్రాంతి వెంకటయ్య రాపూరు సుబ్రమణ్యం, రాజా, వెలివేంద్రం, వేణు గురునాథం, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.
గూడూరు టౌన్‌: ప్రజాసమస్యలపై ఈనెల 15న జరిగే చలోవిజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. శనివారం గూడూరు పట్టణంలోనీ అశోక్‌నగర్‌, అంబేద్కర్‌నగర్‌, శాంతినగర్‌, అరుంధతివాడ, శ్రామికనగర్‌ తదితర ప్రాంతాలలో ఇంటింటికీ తిరిగి ప్రజరక్షణ భేరీ కరపత్రాలను పంపిణీ చేశారు. సీపీఎం సెంట్రల్‌ శాఖా కార్యదర్శి జోగి శివకుమార్‌, సిఐటియు జిల్లా అధ్యక్షులు బివి. రమణయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి సురేష్‌, మణి, బి.చంద్రయ్య, కెవిపిఎస్‌ నాయకులు అడపాల ప్రసాద్‌, మున్సిపల్‌ సంఘం నాయకులు గోపి పాల్గొన్నారు.