Oct 31,2023 23:56

పేదరిక నిర్మూలనే జగనన్న ప్రభుత్వ ధ్యేయం: మంత్రి

పేదరిక నిర్మూలనే జగనన్న ప్రభుత్వ ధ్యేయం: మంత్రి
ప్రజాశక్తి - పుత్తూరు టౌన్‌ : పేదరిక నిర్మూలనే ధ్యేయంగా జగనన్న ప్రభు త్వం పనిచేస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక, యువజన సర్వీసులు, క్రీడా శాఖల మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు.మంగళవారం పుత్తూరు మున్సిపాలిటీ లోని 1వ వార్డు పల్లురు సచివాలయ పరిధిలో ఉన్న మిట్ట పల్లురు, కట్ట కింద రామకష్ణాపురం వీధిలో గడప పడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం అంది స్తున్న సం క్షేమ పథకాలను, చేస్తున్న అభివద్ధి పనులు వివరించారు. ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టోలోని హామీలను 99 శాతం నెరవేర్చామని, అవినీతికి తావులేకుండా వలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలు ఇంటి గుమ్మం వద్దకే వస్తున్నా య న్నారు. అవ్వాతాతల పెన్షన్‌ అందిందా ? చేయూత అందిందా ? అమ్మఒడి అందుతోందా?' అంటూ ఆరా తీశారు. అందరూ అన్నీ అందు తున్నాయని సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఇంటికీ సం క్షేమ పథకాల ద్వారా లక్షల్లో లబ్ధి చేకూరుతోందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రతి సచివా లయానికి రూ.20 లక్షల ప్రత్యేక నిధులు అందుతున్నాయ్ణని అభివద్ధికి వినియోగిస్తున్నట్లు వివరించారు. ఎన్నికల సమయంలో పలు హామీలు గుప్పించే చంద్రబాబునాయుడు, తర్వా త ప్రజల ను మోసం చేయడమే ఆయన నైజమన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికా భివద్ధి సాధించాలంటే రాష్ట్రానికి జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావా లన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్‌ హరి, వైస్‌ చైర్మన్లు శంకర్‌, జయప్రకాష్‌, కౌన్సిలర్లు ఏకాంబరం, గుణ, మోహన్‌ రెడ్డి, దిలీప్‌ నాయకులు జయచంద్ర, తిరునావక్కరుసు, ప్రసాద్‌, గోపి, చక్రి పాల్గొన్నారు.