Jan 02,2023 21:23

మాట్లాడుతున్న ఇన్‌ఛార్జ్‌ కమిషనర్‌ సంపత్‌ కుమార్‌

మాట్లాడుతున్న ఇన్‌ఛార్జ్‌ కమిషనర్‌ సంపత్‌ కుమార్‌
నిర్దేశించిన సమయానికి పరిష్కారం అందించండి
-
ప్రజాశక్తి-నెల్లూరు:రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత ఆశయాలతో నిర్వహిస్తున్న స్పందన వేదికలో అందే ఫిర్యాదుల పరిష్కారంలో నగర పాలక సంస్థ అన్ని విభాగాల సిబ్బంది నిబద్ధత పాటించాలని, నిర్దేశించిన సమయంలోపు సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించాలని ఇంఛార్జ్‌ కమిషనర్‌ సంపత్‌ కుమార్‌ అధికారులకు సూచించారు. కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన వేదికలో ఫిర్యాదుదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించి గడువులోపు పరిష్కరించాలని ఇంచార్జ్‌ కమిషనర్‌ అధికారులను ఆదేశించారు. ప్రతీ విభాగం ఉన్నతాధికారి తమకు సంభందించిన ఫైళ్లు పెండింగులో లేకుండా జాగ్రత్తలు వహించాలని, సూచించిన గడువులోపు సమస్యలు పరిష్కారం కావాలని స్పష్టం చేసారు.
డయల్‌ యువర్‌ కమిషనర్‌ ద్వారా 11 సమస్యలు, స్పందన వేదికలో 13 విజ్ఞప్తులను అందుకున్నామని, గడువులోపు పరిష్కరించేందుకు కషి చేస్తామని తెలిపారు. స్పందన వేదికలో మేనేజర్‌ ఇనాయతుల్లా, ఇంజనీరింగ్‌ విభాగం ఈ.ఈ సంజరు, సెక్రటరీ హేమావతి, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.