Nov 21,2023 23:10

ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్‌ ఈ ఏడాది డిసెం బర్‌ 9న జాతీయ లోక్‌ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు 9వ అదనపు జిల్లా జడ్జి డాక్టర్‌ ఎన్‌.శ్రీనివాస రావు తెలిపారు. స్థానికంగా మంగళవారం కోర్టు పరిధిలోని సిఐలు, ఎస్‌ఐలు, కోర్టు సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలతో జరుగుతున్న ఈ జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో పోలీస్‌ కేసులు పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. కేసులు పరిష్కారానికి తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని పోలీసులకు సూచించారు. లోక్‌ అదాలత్‌ కేసులు పరిష్కరించుకోవడం ద్వారా కక్షిదారులకు సమయం డబ్బు అదా అవుతాయని తెలిపారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి జి.ధర్మారావు, ఫస్ట్‌ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి జెబిటిఎస్‌.దేవి, సెకండ్‌ అడిషనల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ జి.సాయికృష్ణ, కోర్టు పరిధిలోని సర్కిల్‌ ఇన్స్పెక్టర్స్‌, ఎస్‌.ఐ.లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.