Jul 23,2021 12:40

చిత్తూరు : చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో స్వల్పంగా భూమి కంపించింది. శుక్రవారం ఉదయం రెండుసార్లు శబ్ధాలు వచ్చి భూమి కంపించడంతో భయంతో జనం బయటకు పరుగులు తీశారు. దాదాపు 6 సెకన్ల పాటు భూమి కంపిచినట్లు సమాచారం. ఈడిగపల్లి, చిలకావారిపల్లి, షికారు, గూడవారిపల్లిలో కొన్ని ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి.