May 19,2023 22:29
  • సమాన అవకాశాలు, సహకారమే కీలకం
  • నేతలను స్వాగతించిన జిన్‌పింగ్‌ దంపతులు

జియాన్‌ : చైనా, సెంట్రల్‌ ఆసియా దేశాల సంబంధాల్లో కొత్త శకం ఆరంభమైందని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ వ్యాఖ్యానించారు. ఈ రెండు పక్షాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు పలు చర్యలను ప్రకటించారు. పలు ప్రతిపాదనలు చేశారు. చైనా, సెంట్రల్‌ ఆసియా దేశాల శిఖరాగ్ర సమావేశం గురువారం జిన్‌పింగ్‌ అధ్యక్షతన వాయవ్య నగరమైన జియాన్‌లో ప్రారంభమైంది.
అంతర్జాతీయంగా ఎన్ని మార్పులైనా జరగనీ, దానితో నిమిత్తం లేకుండా చైనా, సెంట్రల్‌ ఆసియా దేశాలు ఎల్లప్పుడూ పరస్పరం గౌరవించుకుంటారని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. ఇరుగు పొరుగు దేశాల మధ్య వుండే సుేహ సంబధాలను కొనసాగిస్తామన్నారు. సమాన అవకాశాలు, సహకారానికి కట్టుబడతామన్నారు. ఇరుగు పొరుగు దేశాల స్థాయి నుండి వ్యూహాత్మక భాగస్వాములు అక్కడ నుండి భవితవ్యాన్ని పంచుకునే కమ్యూనిటీ స్థాయికి చైనా సంబంధాలు అభివృద్ధి చెందాయన్నారు. ఇటువంటి సంబంధాలెప్పుడూ ప్రాంతీయ శాంతి, అభివృద్దికి సానుకూల శక్తిని చొప్పిస్తాయన్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న చైనా ఎక్స్‌ప్రెస్‌లోకి ఎక్కాల్సిందిగా సెంట్రల్‌ ఆసియా దేశాలకు స్వాగతం పలుకుతున్నామన్నారు. చైనా-సెంట్రల్‌ ఆసియా సహకారానికి మరింత మెరుగైన భవితవ్యాన్ని కలిసి సృష్టిద్దామనాురు. సుస్థిరమైన, సంపద్వంతమైన, సామరస్యతతో కూడిన సెంట్రల్‌ ఆసియా ఈనాడు ప్రపంచానికి అవసరమని అన్నారు. ఈ ప్రాంతంలో ఘర్షణలు, అసమ్మతి రెచ్చగొట్టే హక్కు ఎవరికీ లేదనాురు. ఉమ్మడి అభివృద్ధి పంథాను అనుసరిస్తూ , చైనాతో సహకారానిు మరింత బలోపేతం చేసుకునేందుకు సెంట్రల్‌ ఆసియా దేశాల నేతలు తమ కృత నిశ్చయానిు ప్రకటించారు.
ఈ తరహాలో మైలురాయి అనదగ్గ ఈ ఉన్నత స్థాయి సదస్సు ప్రారంభమైన తీరు, చైనా దౌత్య ఎజెండాలో సెంట్రల్‌ ఆసియాకు పెరుగుతున్న ప్రాముఖ్యతను తెలియచేస్తోందని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సంక్లిష్టమైన అంతర్జాతీయ, ప్రాంతీయ పరిస్థితుల నేపథ్యంలో చైనా ఇంధనం, వ్యూహాత్మక భద్రతకు పెరుగుతున్న ప్రాముఖ్యతను తెలియచేస్తోందన్నారు.

  • నేతలకు సాదర స్వాగతం

జియాన్‌లో టాంగ్‌ వంశానికి చెందిన ఇంపీరియల్‌ గార్డెస్‌లోని టాంగ్‌ ప్యారడైజ్‌ వద్ద సెంట్రల్‌ ఆసియా నేతలు, వారి సతీమణులను చైనా అధ్యక్షులు జిన్‌పింగ్‌ దంపతులు సాదరంగా స్వాగతించారు. కజక్‌, తజక్‌, కిర్గిజ్‌ అధ్యక్షులు బుధవారానికే జియాన్‌ చేరుకోగా, ఉజ్బెక్‌, తుర్క్‌మినిస్తాన్‌ అధ్యక్షులు గురువారం చేరుకున్నారు. వారందరితో ఙిన్‌పింగ్‌ విడివిడిగా గురువారమే చర్చలు జరిపారు. అనంతరం కిర్గిస్తాన్‌, తజకిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌ నేతలతో జిన్‌పింగ్‌ సంయుక్త డిక్లరేషన్‌లపై సంతకాలు చేశారు.