Nov 27,2020 12:32

విజయవాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయనున్న ప్రమాదకరమైన వ్యవసాయ విద్యుత్‌ మీటర్లను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రైతు, కౌలు రైతు సంఘాలు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా ప్రదర్శనగా వెళుతున్న రైతులను, నాయకులను విజయవాడ బందర్‌ రోడ్డు, వంగవీటి రంగా ఇంటి జంక్షన్‌ వద్ద అడ్డుకున్నారు. రైతులు తీవ్రంగా ప్రతిఘటించినా పోలీసులు వదలకుండా వ్యాన్లలో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు.