Nov 20,2023 23:10

ప్రజాశక్తి - దేవరపల్లి రాష్ట్రంలో నెలకున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు అన్నారు. స్థానిక ఎంపిపి కార్యాలయంలో సోమవారం భూ సమస్యల పరిష్కారం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అసైన్డ్‌ భూములపై హక్కులు కల్పించిన ఘనత సిఎం జగన్‌కే దక్కిందన్నారు. ఈ సందర్భంగా సుమారు 362.423 ఎకరాల భూమిని అర్హత కలిగిన 400 మంది లబ్ధిదారులకు మంజూరైన భూపట్టాలను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కుప్పాల దుర్గారావు, వైసిపి నాయకులు కె.సతీష్‌, జి.జనార్ధన్‌, తహశీల్దార్‌ రామకృష్ణ పాల్గొన్నారు.