
అత్యాధునిక వైద్యం 'యష్'లో లభ్యం
ప్రజాశక్తి- తిరుపతి సిటి: సరికొత్త సాంకేతిక పరికరాలతో, అత్యాధునిక పద్ధతుల్లో అన్ని రకాల వ్యాధులకు నాణ్యమైన వైద్యాన్ని 'యష్' మల్టీస్పెషాలిటీ హాస్పిటల్లో అందిస్తున్నట్లు ఆ ఆసుపత్రి అధినేతలు ప్రముఖ కంటి వైద్యనిపుణులు డాక్టరు రాజ్ యశ్వంత్, ప్రముఖ గైనకాలజిస్టు డాక్టరు జి.రమ్మ తెలిపారు. స్థానిక శ్రీనివాసం కాంప్లెక్స్ పక్కవీధిలోని డిపిఆర్ ఫంక్షన్ హాల్కు ఎదురుగా వాసవి శ్రీటవర్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన యష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద డాక్టరు యశ్వంత్ 'ప్రజాశక్తి'తో మాట్లాడుతూ తిరుపతి దినదినాభివృద్ధి చెందుతుంది. ఆధ్యాత్మికపరంగానే కాదు, ఇటు విద్యారంగంలోనూ ఎదుగుతూ, హెల్త్ హాబ్గా మారుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తాను పుట్టిపెరిగిన ప్రాంతానికి తమవంతు సహయం చేయాలనే ఆలోచనతో అంతర్జాతీయ ప్రమాణాలతో యష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను స్థాపించామన్నారు. వైద్యవృత్తిలో కొనసాగుతున్న తన తండ్రి డాక్టరు వి.కృష్ణమూర్తి ప్రొత్సహాంతో వైద్యరంగంలోకి ప్రవేశించానన్నారు. తనతోపాటు కొంత మంది బంధువులు, మిత్రుల సహాయంతో మల్టీ స్పెషాలిటీని ఏర్పాటు చేసి సుమారు 11 వైద్యవిభాగాలకు చెందిన చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. ప్రారంభించిన అతితక్కువ కాలంలోనే ప్రజామన్నలను పొందుతూ ముందుకెళ్లుతున్నామని వెల్లడించారు. కంటి వైద్య విభాగంలో అనుభవం గడించిన తను తన తండ్రి సహాకారంతో అన్ని రకరాల కంటి సమస్యలకు అత్యాధునిక పద్దతుల్లో వైద్యం అందిస్తున్నానని తెలిపారు. తనతో పాటు గైనకాలజిస్టు డాక్టరు జి.రమ్య ఆధ్వర్యంలో గర్భవతులకు, బాలింతలకు, మహిళ ఎదుర్కొంటున్న వైద్యసమస్యలకు చికిత్స అందిస్తున్నామని, డాక్టరు వి.నవ్య ఆధ్వర్యంలో సంతానలేమి దంపతులకు అత్యాధునిక వైద్యం అందించేందుకు పెర్టిలిటీ క్లీనిక్ను ఏర్పాటు చేశామన్నారు. డాక్టరు మానస ఆధ్వర్యంలో చిన్నపిల్లలు ఆరోగ్య సమస్యలకు, డాక్టరు శోభారాణి ఆధ్వర్యంలో జనరల్ సర్జరీ చికిత్సలు, డాక్టరు సాగర్ ఆధ్వర్యంలో దంత సమస్యలకు చికిత్స, డాక్టరు వాణి ఆధ్వర్యంలో ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్ వంటి వైద్యపరీక్షలను అత్యాధునిక సాంకేతిక పరికరాలతో అందిస్తున్నామన్నారు. తిరుపతిలో అన్ని రకాల వైద్యసేవలు ఒకేచోట అందించాలనే ఉద్దేశంతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను స్థాపించామన్నారు. విశాలమైన హాస్పిటల్ భవనం, సరికొత్త వైద్య పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్యులు, నర్సులు, ఆసుపత్రి సిబ్బందితో రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అతితక్కువ ఫీజులతో అందిస్తూ, రోగులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. రోగులు, వారి కుటుంబ సభ్యులు తమ ఆసుపత్రిని సంప్రదించాలని, వివరాలకు 87148 38714, 0877 2238714 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు.