Jul 23,2021 17:42

అమరావతి : ఎపిలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 65,920 నమూనాలను పరీక్షించగా.. 1,747 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,50,339 మంది కరోనా బారినపడ్డారు. గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 13,223కి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,365 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 19,14,177కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,939 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,39,75,283 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.