Jul 26,2023 14:51

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నరసరావుపేట - మాచర్ల రహదారి మార్గంలో రావిపాడు సమీపాన శాంతినగర్ వద్ద లోడుతో ఉన్న మినీ లారీ రోడ్డుకు అడ్డంగా బోల్తాపట్టంతో ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు గంట నుంచి మాచర్ల నుంచి నరసరావుపేట, నరసరావుపేట నుంచి మాచర్ల వెళ్లే అన్ని రకాల వాహనాలు రోడ్డుకి ఇరువైపులా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇక్కట్లకు గురవుతున్నారు. కావున సంబందిత అధికారులు స్పందించి రోడ్డుకు అడ్డంగా దొర్లిన వాహనాన్ని తొలగించవలసినదిగా ప్రయాణికులు కోరుతున్నారు.