Nov 11,2023 16:55

హైదరాబాద్‌: విజయశాంతి కాంగ్రెస్‌లో చేరతారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేడో, రేపో ఆమె కాంగ్రెస్‌ గూటికి వస్తారన్నారు. ప్రస్తుతం విజయశాంతి బీజేపీలో ఉన్న విషయం తెలిసిందే. కానీ, ఎన్నికల సమయంలో కూడా ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గనడం లేదు. దీంతో గత కొన్ని రోజులుగా విజయశాంతి పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.