Aug 27,2023 09:38

ములుగు : ములుగు జిల్లా ఏటూరునాగారంలోని బ్యాంకు ఖాతాదారుల్లో అకస్మాత్తుగా వేల రూపాయలు జమయ్యాయి. కొందరి ఖాతాల్లో రూ. 2 వేలు, మరికొందరి ఖాతాల్లో రూ. 5 వేలు, రూ. 10 వేలు జమ అయితే, ఇంకొందరి ఖాతాల్లో మాత్రం రూ. లక్ష వరకు జమ అయ్యాయి. ఆ డబ్బును ఎవరు వేశారో? ఎందుకు వేశారో తెలియక ఖాతాదారులు ఆశ్చర్యపోతున్నారు. విషయం తెలిసిన ఇంటెలిజెన్స్‌ వర్గాలు, స్థానిక పోలీసులు ఆరా తీశారు. మెసేజ్‌ వచ్చిన వెంటనే వారంతా పేమెంట్‌ యాప్‌ల ద్వారా తమ వేరే ఖాతాలకు ఆ సొమ్మును బదిలీ చేసుకున్నారు.