Nov 20,2023 11:31

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :   మద్యం నిషేధం అసాధ్యమని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రకటనను ఉపసంహరించుకోవాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి ప్రభావతి, డి రమాదేవి డిమాండ్‌ చేశారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. టిడిపి ప్రభుత్వం 2014లో మద్య నియంత్రణ చేస్తామని హామీ ఇచ్చి ఉల్లంఘించిందన్నారు. 2017-18లో రాష్ట్రంలో మహిళల ఆందోళన తర్వాతే.. మహిళలు అనుమతించిన చోటే షాపులు మూసివేయాలని ఆనాటి టిడిపి కేబినెట్‌ తీర్మానించినట్లు పేర్కొన్నారు. మహిళల ఆందోళన ఫలితంగానే జగన్‌ మద్య నిషేధం హామీ ఇచ్చారన్నారు.