Oct 30,2023 07:49

ప్రజాశక్తి-అవనిగడ్డ (కృష్ణా) :కృష్ణాజిల్లా మోపిదేవి మండలం కె.కొత్తపాలెంలో ఎస్‌టి బాలిక, మహిళలపైనా దాడిచేసిన నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి డిమాండ్‌ చేశారు. అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధిత మహిళలను ఆదివారం ఆమె పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దొంగతనం పేరుతో రాజా, అతని చెల్లెలు రాధిక, ఎస్సై, కానిస్టేబుల్‌ అతి దారుణంగా హింసించారన్నారు. దాడి చేసిన వారికి బెయిల్‌ రావడం చూస్తే కేసును నీరు గార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారనే అనుమానం కలుగుతోందన్నారు. ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని, బాధితురాలి కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బసవపూర్ణ జ్యోతి, నిర్మల, తదితరులు పాల్గొన్నారు.