May 06,2023 12:28

గుజరాత్‌ : ఆప్ఘనిస్తాన్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ భారత్‌లోని ఓ గల్లీలో క్రికెట్‌ ఆడాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు రషీద్‌ ఖాన్‌ను కొనుగోలు చేసింది. కాగా, శుక్రవారం జరిగిన మ్యాచ్‌ లో గుజరాత్‌ గెలుపులో రషీద్‌ ఖాన్‌ కీలక పాత్ర పోషించాడు. కాగా, ఈ మ్యాచ్‌కి ముందు గాంధీ నగర్‌లో ఆయన భారత అభిమానులతో కలిసి సరదాగా క్రికెట్‌ ఆడాడు. బ్యాటింగ్‌ చేసి అందరినీ అలరించాడు.