Aug 13,2023 09:56

అమరావతి : పివి శ్రీనివాస్‌ హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఓ ప్రకటనను విడుదల చేశారు. '' కామ్రేడ్‌ పివి శ్రీనివాస్‌ హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ విచార సమయంలో మీకు (కామ్రేడ్‌ స్వర్ణ జ్యోతి) నా సానుభూతిని తెలియజేస్తున్నాను. పివి శ్రీనివాస్‌ సిపిఎం ఉమ్మడి రాష్ట్ర కమిటీ సభ్యుడు. నవ తెలంగాణ సిజిఎంగా పనిచేశారు. వారి మృతికి సంతాపం తెలియజేస్తున్నాను. '' అని శ్రీనివాసరావు తెలిపారు. నవతెలంగాణ దినపత్రిక మాజీ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ పివి శ్రీనివాస్‌ (50) హఠాన్మరణం చెందారు. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నారాయణగూడలోని తన నివాసంలో తీవ్రమైన గుండెపోటు రావటంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఆయనకు భార్య స్వర్ణ జ్యోతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.