ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ లీగ్ స్టేజ్కే పరిమితమైంది. ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ చేతిలో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలోనే ఆర్సీబీ స్టార్ బ్యాటర్ కోహ్లీ మంగళవారం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ భావోద్వేగ పోస్ట్ చేశాడు.
''ఈ సీజన్లో మెరుగ్గా ఉన్నప్పటికీ దురదష్టవశాత్తూ మనం లక్యానికి కొద్ది దూరంలో నిలిచిపోయాం. నిరాశ చెందినప్పటికీ.. మనం ఎప్పుడూ తలెత్తుకునే ఉండాలి. ఈ ప్రయాణంలో మాకు అడుగడుగునా అండగా నిలిచిన అభిమానులకు రుణపడి ఉంటాం. మా కోచ్లు, మేనేజ్మెంట్, మా జట్టు సభ్యులకు కృతజ్ఞతలు. మరింత బలంగా తిరిగొస్తాం'' అని కోహ్లీ రాసుకొచ్చాడు. థాంక్యూ బెంగళూరు అంటూ ఫొటోలు షేర్ చేశాడు.
A season which had it's moments but unfortunately we fell short of the goal. Disappointed but we must hold our heads high. To our loyal supporters, grateful for backing us every step of the way. pic.twitter.com/82O4WHJbbn
— Virat Kohli (@imVkohli) May 23, 2023










