Nov 18,2023 11:27

తెలంగాణ : బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్‌లో ఆసక్తికర వీడియోను పోస్టు చేసి హర్షాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారానికిగాను నిజామాబాద్‌ నుంచి జగిత్యాలకు వెళుతున్న క్రమంలో ... ఆర్మూర్‌లోని సిద్దులగుట్ట వద్ద రోడ్డుకు ఇరువైపులా రైతులు వడ్లను ఆరబెట్టిన దృశ్యాలను ఆమె చిత్రీకరించారు. రోడ్డు పక్కన ఉన్న వరి ధాన్యపు రాశులను చూసి కవిత మురిసిపోయారు. తాను వెళుతున్న దారిలో ఆ ధాన్యపు రాశులను చూసిన కవిత.. తన మొబైల్‌లో చిత్రీకరించి, ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. '' ధాన్యపు రాశుల తెలంగాణ. అప్పుడు ఎట్లుంది తెలంగాణ..!! ఇప్పుడు ఎట్లైంది తెలంగాణ !!'' అని కవిత పేర్కొన్నారు.

ధాన్యపు రాశుల తెలంగాణ !!!

అప్పుడు ఎట్లుండే తెలంగాణ !!
ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ !!

enroute to Jagityal ... This scene is at siddula gutta, Armur.
Same scene across Telangana !!

Jai Telangan !! Jai KCR !!
Vote For CAR to continue the growth story of Telangana !!!… pic.twitter.com/BSK7hxG4tA

;