Oct 31,2023 14:40

హైదరాబాద్‌: మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి జిల్లెలగూడలో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. చైతన్యపురిలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న విద్యార్థి(16).. కాలేజీ యాజమాన్యం వేధింపుల కారణంగానే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు సూసైట్‌ నోట్‌ రాశాడు. ఎక్కువ మార్కులు రావాలని ప్రిన్సిపల్‌ ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించాడు. ఇంకెవరూ ఈ కాలేజీలో జాయిన్‌ కావొద్దని.. సారీ అమ్మా, నాన్న అని లేఖలో పేర్కొన్నాడు. తమకు న్యాయం జరిగేవరకూ మఅతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించేదిలేదని కుటుంబసభ్యులు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.