
తిరుమల : తిరుమలకు చెందిన శ్రీవాణి ట్రస్టుపై కొంతమంది చేస్తున్న ఆరోపణలు నిగ్గు తేల్చేందుకు టీటీడీ బోర్డు తిరుపతి ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీకి అనుమతించింది. శ్రీవాణి ట్రస్టు ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అనేక పురాతన ఆలయాల జీర్ణోద్ధరణతోపాటు ఎస్సీ , ఎస్టీ, బీసీ , మత్స్యకార గ్రామాల్లో ఆలయాల నిర్మాణానికి టీటీడీ నిధులు అందిస్తోంది. దీంతోపాటు ఆయా ప్రాంతాల్లోని ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు ఆర్థికసాయం కూడా చేస్తోంది.శ్రీవాణి ట్రస్టుపై టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి కూడా ఇటీవల శ్వేతపత్రాన్నీ విడుదల చేశారు. అయినప్పటికీ కొందరు శ్రీవాణి ట్రస్టు నిర్వహణపై ఆరోపణలు చేస్తుండడంతో ఈ విషయంలో వాస్తవాలు తెలుసుకునేందుకు తిరుపతి ప్రెస్క్లబ్ నిజనిర్ధారణ కమిటీగా ఏర్పాటై ముందుకు వచ్చింది. వాస్తవాలు తెలుసుకోవడానికి సదరు కమిటీకి టీటీడీ అనుమతించింది.