Nov 21,2023 11:36

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్‌ : జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్‌ ఆదేశాల మేరకు శాంతిభద్రతలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేసి నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కర్నూలు సబ్‌ డివిజన్‌ పోలీసులు బఅందాలుగా ఏర్పడి మంగళవారం తెల్లవారుజామున కర్నూలు డిఎస్పీ విజయశేఖర్‌ సమక్షంలో కర్నూలు తాలుకా సిఐ శ్రీరామ్‌ ఆధ్వర్యంలో టివి 9 కాలనీ లో కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. కర్నూల్‌, టీవీ9 కాలనీ ప్రజలతో కర్నూలు పట్టణ డిఎస్పీ విజయ శేఖర్‌, ట్రైనీ డీఎస్పీ భావన మాట్లాడుతూ... నాటు సారా తయారీదారుల పై నిరంతర నిఘా ఉంచుతామన్నారు. ఈ దాడులు మరింత ముమ్మరం చేస్తామన్నారు. నాటుసారా తయారీ , విక్రయం దారులు నాటు సారా జోలికి పోకూడదన్నారు .ఏవరైనా చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రౌడీ మూకలు, అల్లరి మూకల ను హెచ్చరించారు. ఈ కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ దాడులలో ఇద్దర్నీ అరెస్ట్‌ చేసి, సరైన ధ్రువపత్రాలు లేని 30 బైక్‌లు, 20 లీటర్ల నాటుసారా ను స్వాధీనం చేసుకున్నారు. 600 లీటర్ల నాటు సారా ఊటను ధ్వంసం చేశారు. ఈ కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ లో ట్రైనీ డీఎస్పీ భావన, కర్నూలు తాలుకా సిఐ శ్రీరామ్‌ , కర్నూల్‌ దిశ పియస్‌ సీఐ కళా వెంకట రమణ, కర్నూల్‌ రూరల్‌ సీఐ కిరణ్‌ కుమార్‌ రెడ్డి, 6 మంది ఎస్సైలు, 50 మంది పోలీసులు పాల్గొన్నారు.