Sep 19,2023 14:13

అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.ఈ కేసులో కీలక పాయింట్లను వివరించిన సాల్వే.. చంద్రబాబును అరెస్ట్‌ చేసే సమయానికి ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు లేదని చెప్పారు. ఈ సందర్భంగా స్టేట్‌ ఆఫ్‌ రాజస్థాన్‌ వర్సెస్‌ తేజ్‌మాల్‌ చౌదరి, అర్ణబ్‌ గోస్వామి కేసులను ప్రస్తావించారు. ఆ తర్వాత మరో సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా చంద్రబాబు తరఫున వాదనలు వినిపించారు. అనంతరం క్వాష్‌ పిటిషన్‌పై విచారణను హైకోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది.