Nov 22,2023 09:56

ఇబ్రహీంపట్నం (ఎన్‌టిఆర్‌) : ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుధవారం కేతనకొండ గ్రామంలో తెల్లవారుజామున జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 8 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అందులో ఇద్దరు చనిపోగా, మిగిలినవారికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులు 1.బండి సుబ్బారావు, కోటికలపూడి, ఇబ్రహీంపట్నం మండలం, 2. సావిత్రి, విజయవాడ గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.