ప్రజాశక్తి-పెరవలి (తూర్పుగోదావరి జిల్లా) : మండలం తీపర్రు గ్రామంలో నిడదవోలు నియోజకవర్గం సీనియర్ నాయకులు కుందుల వీర వెంకట సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలవేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు 41 ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










