ప్రజాశక్తి-చాగల్లు : మండలంలో మల్లవరం గ్రామంలో సుశీల వృద్ధాశ్రమంలో కొవ్వూరు మండలం వాడపల్లి గ్రామస్తులు కరుటూరి వెంకట్రావు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి ఏ ఎస్ జోహార్ ప్రారంభించారు. అనంతరం ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ మండుతున్న వేసవికాలంలో బాటసారిలకు చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందిమన్నారు. ఈ కార్యక్రమంలో లకంసాని భద్రం, బూరుగుపల్లి వీర రాఘవులు కోడూరి ప్రసాద్ కరుటూరి సతీష కోడూరి కాశ బండి శ్రీను హరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.










