
'ప్రజా రక్షణ భేరి' గోడపత్రికల ఆవిష్కరణలో వక్తలు
ప్రజాశక్తి - గుడివాడ : నవంబర్ 15వి తేదీన విజయవాడలో జరిగే ప్రజా రక్షణ బేరి భారీ బహిరంగ ప్రదర్శన జయప్రదం చేయాలని గుడివాడ సిపిఎం మండల కార్యదర్శి ఆర్సిపి రెడ్డి కోరారు. గుడివాడ సుందరయ్య భవన్ లో ప్రజా రక్షణ బేరి భారీ బహిరంగ ప్రదర్శన పోస్టర్ ను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్సిపి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ద్రోహం చేసిన మతోన్మాద బీజేపీని ఓడించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్బంధ విధానాలపై పోరాడాలని, వామపక్ష ప్రజాతంత్ర శక్తులు ఐక్యత వర్ధిల్లాలని, అలాగే సిపిఎం ని బలపరచాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో జరిగే ప్రజా రక్షణ బేరి భారీ బహిరంగ ప్రదర్శనకు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పాల్గొంటారన్నారు. ఈ భారీ బహిరంగ ప్రదర్శనకు లక్షలాది మంది కార్మికులు కర్షకులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి రజిని, ఎస్ సమరం, వై యేసయ్య, ఎల్ సురేంద్ర, కోరుమిల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.