ప్రజాశక్తి - చాగల్లు : దేశ స్వాతంత్య్రానికి జాతిపిత మహాత్మా గాంధీ చేసిన పోరాటం చాలా గొప్పదని.. ఆయన అనుసరించిన శాంతి అహింస సత్యం మార్గాలు ఎంతో ఉత్తమమైనవని చాగల్లు గ్రామపంచాయతీ సెక్రటరీ ఎల్ రవికుమార్ అన్నారు. సోమవారం మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా కోరింగ్ లింగయ్య కొట్టు వద్ద వద్ద, మెయిన్ బజార్లో ఆంజనేయస్వామి గుడి వద్ద, నందమూరి రోడ్డు వద్ద ఆర్యవైశ్య సంఘం నాయకులు మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా స్వాతంత్ర సమరయోధులు లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసిన నివాళులు అర్పించారు. నందమూరి రోడ్డు వద్ద మహాత్మా గాంధీ విగ్రహం దాత శ్రీకాకుళం ఆంజనేయులును శాలువా కప్పి పూలదండలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ గండ్రోతు. సురేంద్ర సీనియర్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు గండ్రోతు సూర్యనారాయణ చెల్లింకల దుర్గామల్లేశ్వరరావు జట్టా ఏడుకొండలు ఉన్నమట్ల విజయ కుమారి వర్ధిని చిన్నబాబు గ్రంధి రాంబాబు శ్రీకాకుళం ఆంజనేయులు బొర్రా రజిని జాలం వెంకట్రావు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు










