ప్రజాశక్తి - ఉండ్రాజవరం (తూర్పు గోదావరి) : టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబును అక్రమ రిమాండ్ నుండి త్వరగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ... ఆదివారం వేలివెన్ను నుండి గౌరీపట్నం వరకు పాదయాత్ర నిర్వహించారు. నిర్మలగిరి మేరీమాతను కోరుకుంటూ బూరుగుపల్లి శేషారావు నాయకత్వంలో వేలివెన్ను తెలుగుదేశం పార్టీ ఎస్ సి మాదిగ సామాజిక వర్గం కార్యకర్తలు పాదయాత్ర గా తరలి వెళ్లారు.










