Nov 13,2023 22:53

యువకుడు ఆత్మహత్య

యువకుడు ఆత్మహత్య
ప్రజాశక్తి -సత్యవేడు: క్రిమి సంహారక మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం మండ లంలో చోటుచేసుకుంది. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం కన్నవరం ఎస్సీ కాలనీకి చెందిన అభిషేక్‌(20) క్రిమి సంహారకమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సత్యవేడు పట్టణం సదవాలమ్మ దేవాలయం సమీపంలో తెలుగు గంగ కాల్వ ప్రాంతంలో అభిషేక్‌ మతదేహం ఆదివారం సాయంత్రం బయటపడినట్లు సమాచారం. నాగలాపురం మండలం బీర కుప్పం గ్రామంలో ఓ వివాహిత మహిళతో పరిచయం, వివాదాల నేపథ్యంలో మనస్థాపానికి గురైన కన్నవరం ఈశ్వరన్‌ కుమారుడు అభిషేక్‌ ఐదారు రోజులు క్రితమే ఆత్మహత్య చేసుక్నుట్లు మతదేహం ఆనవాళ్లు బట్టి తెలుస్తోందని స్థానిక ఎస్‌ఐ శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. అభిషేక్‌ మతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. పోలీసుల విచారణ అనంతరం సమాచారం పూర్తిస్థాయిలో తెలియాల్సి ఉంది. మృతుడు అభిషేక్‌ హీరో మోటారు కంపెనీలో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.