Nov 20,2023 23:35

అధ్యక్షలు బి.ఆదిలక్ష్మి, ప్రధాన కార్యదర్శి ఎం.కళాధర్‌

ప్రజాశక్తి-గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) గుంటూరు జిల్లా నూతన కమిటీ ఎన్నికైంది. ఆదివారం పొన్నూరులో జరిగిన జిల్లా కౌన్సిల్‌ సమావేశాల్లో ఈ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర కార్యదర్శి నవ కోటేశ్వరరావు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఎన్నికైన కమిటీ సభ్యుల వివరాలను జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సోమవారం విడుదల చేశారు. నూతన అధ్యక్షులుగా బి.ఆదిలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా ఎం.కళాధర్‌, గౌరవాధ్యక్షులుగా పి.వి.శ్రీనివాసరావు, సహాధ్యక్షులుగా జి.వెంకటేశ్వర్లు, ఎఎల్‌.శివపార్వతి, కోశాధికారిగా ఎమ్‌డి.గయాసుద్దౌలా ఎన్నికయ్యారు. జిల్లా కార్యదర్శులుగా సిహెచ్‌.ఆదినారాయణ, కె.సాంబశివరావు, డి.సాయికృష్ణ, జి.వెంకటేశ్వరరావు, ఎం.గోవిందయ్య, టి.ఆంజనేయులు, యు.రాజశేఖర్‌, జి.వి.ధనలక్ష్మి, కె.కేదార్‌ నాథ్‌ ఎన్నికయ్యారు. నూతన కమిటీతో రాష్ట్ర సహాధ్యక్షులు ఎ.ఎన్‌.కుసుమ కుమారి ప్రమాణస్వీకారం చేయించారు.