
ప్రజాశక్తి-రామచంద్రపురం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, వర్షాల వల్ల తొలకరి వరిచేలు నేలకొరిగాయి. తొలకరి నాట్లు వేసే సమయంలో కురవాల్సిన వర్షాలు అప్పుడు కురవకపోగా ఇప్పుడు పంటలు పూర్తిగా పండి కోతలు దశకు చేరుకున్న సమయంలో మూడు రోజులుగా వర్షాలు కురవడంతో పలుచోట్ల చేలు నేలకొరిగాయి. దీంతో తొలకరి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. వర్షాలు ఇలాగే కొనసాగితే మరింత నష్టం వాటిలో అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు.