లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీఁయర్ నేత కల్యాణ్ సింగ్ ఆరోగ్యం విషమంగానే ఉంది. జులై 4న అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన అప్పటి నుండి చికిత్స పొందుతూనే ఉన్నారు. లక్నోలోఁ సంజరు గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిజిఐ) వైద్యులు మంగళవారం హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు. కల్యాణ్ సింగ్ లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్పై ఉన్నారఁ, వైద్యులు ఆయనకఁ తరచూ డయాలసిస్ చేస్తున్నారఁ, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందఁ తెలిపారు. ప్రత్యేక వైద్య బందం ఆయనకఁ చికిత్స అందిస్తోందఁ చెప్పారు. కాగా యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆసుపత్రికి వచ్చి కల్యాణ్ సింగ్ను పరామర్శించారు.