విరాళం అందజేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి -కందుకూరు :కందుకూరులోని అంకమ్మ తల్లి ఆలయ పునర్ నిర్మాణం ఎంఎల్ఎ మానుగుంట మహీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా లయ నిర్మాణ కమిటీ సభ్యుల, భక్తుల పర్యవేక్షణలో జరుగుతోంది. ఆదివారం ఆలయ నిర్మాణానికి స్వర్గీయ కుంచాల వెంకటేశ్వర్ల జ్ఞాపకార్థం భార్య వెంకటరత్నం కుమారుడు శ్రీనివాసులు కోడలు విజయలక్ష్మి రూ.1,00,116 విరాళంగా ఆలయ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు వెంకటరెడ్డికి అందజేశారు.










