Apr 16,2021 12:00

విజయవాడ : ఎపిలో కరోనా కేసులు రోజు రోజుకు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి విద్యార్థులకు, యువతకు ఎక్కువగా సోకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పాఠశాలలు, కళాశాలల్లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా విజయవాడ పడమటలోని కోనేరు బసవయ్య చౌదరి పాఠశాలలో కరోనా కలకలం రేపింది. ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో యాజమాన్యం మూడు రోజులపాటు సెలవు ప్రకటించింది. పాఠశాలలో మొత్తం 1,300 విద్యార్థులు, 40 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన ఉపాధ్యాయుడు ఇటీవలే ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. ఉపాధ్యాయునికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో.. విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయాలని యాజమాన్యం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.