ప్రజాశక్తి - కోసిగి
పాఠశాల స్థాయిలో విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు జెవివి జిల్లా ఉపాధ్యక్షులు శంకరయ్య తెలిపారు. శుక్రవారం మండలంలోని కోసిగి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల, దుద్ది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జంపాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో, మౌంట్ కార్మెల్ ప్రయివేట్ పాఠశాలలో మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోసిగి ప్రధానోపాధ్యాయులు ఖలీల్ అహ్మద్ మాట్లాడారు. జెవివి చెకుముకి పోటీలు నిర్వహించడం కోసిగి ప్రాంతానికి శుభ పరిణామమని తెలిపారు. వెనుకబడిన కోసిగి ప్రాంత విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని, కుతూహలాన్ని కలిగిస్తోందని చెప్పారు. మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు సమాజం నుంచి తొలగిపోయి ప్రతి ఒక్కరి జీవితాల్లో శాస్త్రీయ భావజాలం ప్రతిఫలించినప్పుడే శాస్త్రీయ సమాజం ఆవిర్భవిస్తుందని తెలిపారు. అనంతరం జెవివి జిల్లా ఉపాధ్యక్షులు శంకరయ్య మాట్లాడారు. జెవివి ఆధ్వర్యంలో ఈనెల 7 నుంచి ఫిబ్రవరి 28 వరకు ప్రజల్లో సైన్స్ గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు అంతయ్య, గురుస్వామి, వెంకటరెడ్డి, రవికుమార్, సుభాన్ సింగ్, రహీం, మేఘనాథ్, మహేష్, చంద్రశేఖర్, సులేమాన్ పాల్గొన్నారు. కౌతాళం మండలం ఎరిగేరి ఉన్నత పాఠశాలలో జెవివి, యుటిఎఫ్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు రమేష్ పర్యవేక్షణలో చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఉపాధ్యాయులు మాధురి, రాము, రేణుకమ్మ, వెంకటేశులు, అబ్దుల్ రహీం, బీరప్ప, రంగారెడ్డి, చిట్టి రాజు, లింగన్న, లీలావతి, రాజ్యలక్ష్మి, సుధారాణి, జయరాణి పాల్గొన్నారు. గోనెగండ్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కస్తూర్బా గాంధీ విద్యాలయం, ఎపి మోడల్ స్కూల్లో సుమారు 500 మంది విద్యార్థులకు చెకుముకి సైన్సు పరీక్షలు నిర్వహించారు. జెవివి సైన్స్ కోఆర్డినేటర్ కె.విజరు కుమార్, యుటిఎఫ్ సీనియర్ నాయకులు గుమ్మల బాబు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగభూషణం, ఎపి మోడల్ స్కూల్ ఇన్ఛార్జీ ప్రిన్సిపల్ పద్మావతి, కస్తూర్బా గాంధీ విద్యాలయం ఇన్ఛార్జీ స్పెషల్ ఆఫీసర్ రాధా రాణి, ఉపాధ్యాయులు అక్బర్, అమానుల్లా బేగ్, మహబూబ్ బాష, తాజుద్దీన్, రామచందర్రావు, భాస్కర్, మురళీకృష్ణ, ఉస్మాన్, రంగస్వామి, ఖాదర్ భాష, రవికుమార్, నాగజ్యోతి, మల్లేశ్వరమ్మ, ప్రమీల బాయి పాల్గొన్నారు.