Nov 08,2023 22:47

ప్రజాశక్తి-యంత్రాంగం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి నిరసనంగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి చేపట్టిన ఉద్యమం వెయ్యి రోజులు రోజులు పూర్తయిన సందర్భంగా బుధవారం చేపట్టిన విద్యాసంస్థల బంద్‌ విజయవంతం అయ్యింది. అమలాపురం పిడిఎస్‌యు, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఒక రోజు ముందుగానే నోటీసులు అందించడంతో ప్రైవేటు విద్యాసంస్థలు బంద్‌ ప్రకటించాయి. అనంతరం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడు రేవు తిరుపతిరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్‌ సాపే రమేష్‌, బి.ప్రతాప్‌ కుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వి.దొరబాబు, కె.ప్రణీత్‌, కె.శంకర్‌ పాల్గొన్నారు.
ఆలమూరు మండలంలో అన్ని విద్యాసంస్థల బంద్‌ విజయవంతం అయ్యిందని ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ రవికుమార్‌ తెలిపారు. జిల్లా కో కన్వీనర్‌ వెంకట్‌, బాలికల కన్వీనర్‌ వెన్నెల, సాయి కుమార్‌, సతీష్‌, భాను, ప్రసాద్‌, శ్యాంబాబు, సందీప్‌, సుహాస్‌, గణేష్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. రాజోలులో ఎఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల బంద్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయుకులు తాడి రవీంద్ర, ఎఐఎస్‌ఎఫ్‌ నాయకులు దేవ రాజేంద్ర ప్రసాద్‌, పవన్‌ నాయుడు, ఉండ్రు ప్రశాంత్‌, ఉదయరామరాజు పాల్గొన్నారు. రామచంద్రపురం పిడిఎస్‌యు ఆధ్వర్యంలో బంద్‌ చేపట్టారు. నాయకులు కర్రి గణేష్‌, కుర్మాదాసు సాహిల్‌, ఎఐకెఎంఎస్‌ జిల్లా నాయకులు వి.బీమా శంకర్‌, చింతా రాజారెడ్డి, అంబటి కృష్ణ, పద్మ, యేసు, సాల్మన్‌ రాజు, లక్ష్మణ్‌ రావు, అభిషేక్‌, సత్య సాయి, సతీష్‌ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.